23.Sep.NN1NEWS.శృంగవరపుకోట.
మ హిళలపై అఘాయిత్యాలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘటన చట్టాలు రూపొందించాలని ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కో కన్వీనర్ భారతి డిమాండ్ చేశారు.భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని దేవి కూడలిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలపై విద్యార్థినిలు వీధి నాటకాన్ని నిర్వహించారు.
జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై గంగరాజు మత్తుపదార్థాల వాడకం వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వి చిన్నబాబు, జిల్లా జాయింట్ సెక్రెటరీ రమేష్, జిల్లా కమిటీ సభ్యులు అను, మండల అధ్యక్షుడు రత్న, రిషి మరియు వివిధ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.