జగన్ రెడ్డి ఆరాచకాలపై లోకేష్ పూరించిన నాధమే 'శంఖారావం
శృంగవరపుకోట.
జగన్ రెడ్డి ఆరాచకాలపై లోకేష్ పూరించిన నాధమే 'శంఖారావం' శృంగవరపుకోట నియోజకవర్గ ఇంచార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి.
శృంగవరపుకోట మండల కేంద్రంలో ఉన్న అన్న క్యాంటీన్ వద్ద శనివారం శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ "జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూరించిన నాధమే శంఖారావం. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించని నియోజకవర్గాల్లో శంఖారావంతో పర్యటించి జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు, కార్యకర్తలకు తెలియజేయనున్నారని, నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతుండగా,ధరల పెరుగుదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న, రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు టీడీపీ ‘శంఖారావం’ అనే కీలక ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ప్రజల సమస్యలను ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా నోట్ చేస్తారు.
నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా శంఖారావం చేపట్టనున్నారు.
ఇందులో భాగంగా రానున్న 40-50 రోజుల్లో 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటించనున్నారని,
ఒక్కరోజులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం జరుగుతుంది.
సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి...
శంఖారావం ద్వారా ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా నోట్ చేస్తారు.
శంఖారావం ద్వారా బాబు స్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారంటీ హామీ కార్యక్రమంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటికీ చేరువవుతారు.
ఇప్పటికే యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్నీ గ్రామాల్లో, పట్టణాల్లో నారా లోకేశ్ గారు పర్యటించారు. జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై, అరాచక పాలనపై గొంతెత్తి ప్రజలకు మద్దతుగా నిలిచారు.
పాదయాత్ర ద్వారా నారా లోకేష్ భరోసా..!
వైఎస్సార్సీపీ నేతల అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా 220 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్ర ద్వారా నారా లోకేష్ భరోసా ఇచ్చారు. యువగళం పాదయాత్రను ఉత్తరాంధ్రలో కొనసాగించాలనుకున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్తో అడ్డంకులు ఎదురయ్యాయి.శంఖారావం పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ వైపు మరింత చేరువయ్యేలా చేస్తుంది.ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు నేరుగా నారా లోకేష్తో తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.కోట మండల పార్టీ అధ్యక్షుడు జి.ఎస్ నాయుడు,మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ నానిగిరి రమణాజీ, క్లస్టర్ ఇంచార్జ్ కాపుగంటి వాసు,మాజీ ఎంపీటీసి గన్ను బంగారమ్మ, బోనంగి జ్యోతి, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.