సంపన్నుడికి సామాన్యుడికి సమాన భోజనం ఎమ్మెల్యే పాయం.
NN1NEWS, 03/04/2025కరకగూడెం మండలం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో రేషన్ షాప్ నందు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి స్వయంగా లబ్ధిదారులకు బియ్యం అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం MRO నాగ ప్రసాద్ గారు, MPDO కుమార్, మండల అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, పోలబోయిన శ్రీవాణి, ఎర్ర సురేష్, రాందాస్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు