పొగాకు, మద్యపానం, మాదకద్రవ్యల దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమం.
జి ఎమ్ అర్ ఐ టి రాజాం ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో తాటిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న 7 రోజుల ఎన్. ఎస్. ఎస్. ప్రత్యేక సేవా శిబిరము లో భాగంగా 3వ రోజు శుక్రవారం తాటిపాడు గ్రామం లో ముందుగా పొగాకు, మద్యపానం, మాదకద్రవ్యల దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్. పి. యూ. పి. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గార రాంబాబు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పుగాకు, మద్యపానం, మరియు మాదకద్రవ్యల వాడకం వలన కలిగే దుష్పలితాలను వివరించారు. వీటి వాడకం వల్ల ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, డబ్బు నష్టపోతారని, కావున వీటి భారిన పడవద్దని కోరారు. ఈ కార్యక్రమం లో ఎన్. ఎస్. ఎస్ వాలంటీర్స్ చేసిన నినాదాలు ప్రజలను ఆలోచింపజేశాయి.
అనంతరం శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి, విజయనగరం వారి సౌజన్యముతో ఉచిత కంటి పరీక్ష శిభిరాన్ని ఏర్పాటు చేసారు. ఈ శిభిరం లో సుమారు 120 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో సుమారు 50 మందికి సూచనలు చేయగా, 30 మందిని కాటారక్ట్ ఆపరేషన్ కొరకు ఎంపిక చేశారు. వారిని విజయనగరం ఆసుపత్రి కి తీసుకోనివెల్లి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తారని పుష్పగిరి ఆసుపత్రి కి చెందిన పి. ఆర్. ఓ ఎ. లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమం లో అప్తా్లామిక్ సిబ్బంది కావ్య, పూజితలు పరీక్ష లు నిర్వహించారు.
ఈ మూడవ రోజు కార్యక్రమంలో ఎమ్ పి యూ పి స్కూల్ పిల్లలకు వివిధ ఆటల పోటీలు, డ్రాయింగ్, క్విజ్ మొదలగు పోటీలు నిర్వహించారు. అంతే కాకుండా శ్రీకాకుళం మరియు విజయనగరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు, స్కూల్ విద్యార్థుల కు ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ యువత పాల్గొన్నారు. ఎన్. ఎస్. ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డా. కె.వి. ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో 50 మంది ఎన్. ఎస్. ఎస్. వొలుంటేర్లు తమ సేవలు అందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పి చైతన్య కుమార్, కే సత్యనారాయణ, సిహెచ్ మన్మధరావు, పవన్ పాల్గొన్నారు.